కంటోన్మెంట్, ఆగస్టు 28: మోండా డివిజన్లోని పెరుమాల్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శనివారం కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్నను దేవస్థానం కమిటీ చైర్మన్ నర్సారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధితో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అదే విధంగా వచ్చే నెల మొదటి వారంలో ఆలయ స్థలంలో కల్యాణ మండపం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేసే విషయమై సమాలోచనలు చేశారు. దేవస్థానానికి చెందిన స్థలం ఉండటంతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఆ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే సెప్టెంబర్ తొలి వారంలో కల్యాణ మండపానికి సైతం భూమి పూజ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కార్యక్రమంలో నివేదితా, దేవస్థానం పాలకమండలి సభ్యులు కసిరెడ్డి నరేందర్రెడ్డి, నరేశ్, అజయ్యాదవ్ ఉన్నారు.