మెహిదీపట్నం మార్చి 12 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని,ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి, సికింద్రాబాద్ లోక్సభ ఇన్చార్జి బండి రమేశ్ అన్నారు. శుక్రవారం నాంపల్లి నియోజకవర్గం రెడ్హిల్స్, విజయ్నగర్ కాలనీ డివిజన్లలో నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్తో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ కలీం, ప్రదీప్ అగర్వాల్ పాల్గొన్నారు. ఆసిఫ్నగర్ డివిజన్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ప్రచారం చేశారు.
కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి ఇక్బాల్ సిద్ధిఖీ, నాయకులు విద్యాసాగర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మల్లేపల్లి డివిజన్లో పరిశీలికులు ప్రవీణ్కుమార్, డివిజన్ ఎన్నికల ఇన్చార్జి సి.సంజయ్, ఆసిఫ్నగర్లో ఎన్నికల ఇన్చార్జ్జి ఇక్బాల్సిద్ధికీ డివిజన్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెహిదీపట్నంలో.. డివిజన్ అధ్యక్షుడు మెట్టు నట్రాజ్, సీనియర్ నాయకుడు చింతల అశోక్ముదిరాజ్ పట్టభద్రుల ఇండ్లకువెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు. అహ్మద్నగర్ డివిజన్ మాసాబ్ట్యాంక్ శ్రీరాంనగర్లో డివిజన్ ఇన్చార్జి అశ్విన్ మార్గం టీఆర్ఎస్ నాయకులు మమతశ్రీశైలంగౌడ్, జకీఉల్లాఖాన్, సాయిగౌడ్తో కలిసి ప్రచారం చేపట్టారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కార్వాన్ నియోజకవర్గం ఇన్చార్జి ఠాకూర్ జీవన్ సింగ్ కోరారు. శుక్రవారం గోల్కొండ, టోలీచౌకిలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి జీవన్సింగ్ ప్రచారం చేపట్టారు. లంగర్హౌస్ డివిజన్లో నాయకులు కోయల్కార్ గోవింద్రాజ్, నాగుల పల్లి రవికాంత్, సత్యనారాయణరాజు ప్రచారం నిర్వహించారు.
కార్వాన్, మార్చి 12 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కార్వాన్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముత్యాల భాస్కర్, బి. శ్రీనివాస్, దుర్గరాజు, శ్రవణ్ పాల్గొన్నారు.