బడంగ్పేట, జనవరి8: యువత క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలి మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ ఉన్న కేఎన్ఆర్ గ్రౌండ్లో బీఆర్ఎస్ నాయకుడు టేకుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జై కిసాన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడుతాయన్నారు. డివిజన్ స్థాయి నుంచి క్రీడా రంగాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు.
మంచి శిక్షణ తీసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఇలాంటి పోటీలను నిర్వహించినప్పుడే క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుందన్నారు. సాధన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్ రోహిణి రమేశ్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద బావి ఆనంద్ రెడ్డి లిక్కి కృష్ణారెడ్డి, కోఆప్షన్ జగన్మోహన్ రెడ్డి, , బీఆర్ఎస్ నాయకులు సుందర్శన్ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి,బీఆర్ఎస్ నాయకులు జంగయ్య, క్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, గణేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.