కాంగ్రెస్ అంటేనే… కరువు, ఆకలికేకలు, తాగునీటి ఎద్దడి..ఆ పార్టీ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే తెలంగాణలో కరెంటు పోయింది.. కరువొచ్చింది. ప్రజాసంక్షేమం అటకెక్కింది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని నార్సింగిలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
మణికొండ, మార్చి 26 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కరువును తీసుకొచ్చిందని.. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం, నార్సింగిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్కిట్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చి పేదలకు మేలు చేస్తే.. అంతకంటే బాగా చేస్తారేమోనని కాంగ్రెస్ను నమ్మి ఎన్నికల్లో గెలిపిస్తే మమ్మల్ని నట్టేట ముంచారని ప్రజలు బాధపడుతు న్నారన్నారు.
చేవెళ్ల అభ్యర్థులుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే గుర్తింపు వచ్చిందన్నారు. విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలను గత ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించారని గుర్తు చేశారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రంజిత్రెడ్డి ఎందుకు పార్టీ మారారో తెలియదని…కానీ బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తల శక్తిని తక్కువగా అంచనా వేసి పార్టీ వీడిన వారికి మన శక్తి చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు. ఈ లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ శ్రేణులు ఓ చాలెంజ్గా తీసుకుని కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన రంగారెడ్డి జడ్పీచైర్మన్గా, ఎమ్మెల్సీగా బడుగు, బలహీల వర్గాలకు అండగా ఉన్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలందరూ లబ్ధి పొందారన్నారు. అంతేకాకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభ్యున్నతికి కేసీఆర్, కేటీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను టార్గెట్ చేసి తిట్టడమే పనిగా పెట్టుకుని.. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.
కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లుగా పాలన సాగుతున్నదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పేరు, గుర్తు లేకుండా చేస్తానంటూ సీఎం రేవంత్ అతిగా మా ట్లాడుతున్నాడని మండిపడ్డారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు పలుకుతూనే ఉంటారన్నారు. కార్యక్రమంలో నార్సింగి, శంషాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు, రేఖాయాదగిరి, సుష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్లు వేణుగోపాల్యాదవ్, వెంకటేశ్యాదవ్, పార్టీ అధ్యక్షులు నర్సింహ, చంద్రారెడ్డి, కౌన్సిలర్లు ప్రవీణ్కుమార్, శివారెడ్డి, శ్రీకాంత్, ఉషారాణి, రామకృష్ణారెడ్డి, అరుణజ్యోతి, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక ఎత్తున పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను 80శాతం వరకు పూర్తి చేశా రు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది.. కరువు వచ్చింది. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నది. రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగువేసేందుకు ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారు.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే చేవెళ్ల
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం పాలన సాగింది. కానీ ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టంవచ్చినట్లు నడుస్తున్నది. గత పదేండ్ల కాలంలో ఎప్పుడూ కరెంటు పోలేదు.. నీళ్లు, సంక్షేమ పథకాలు ఆగలేదు. రంజిత్రెడ్డి అనే వ్యక్తి మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకున్నా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మనమందరం కష్టపడి ఎంపీగా గెలిపించుకున్నాం..కానీ ఆయనకు సం స్కారం లేదు. అలాంటి వారిని రానున్న ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలి. బీసీ బిడ్డ, మనలో ఒకరిగా ఉండే కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందాం.
-ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్యే, రాజేంద్రనగర్
అధికారం కోసం.. స్వలాభం కోసం పార్టీలు మారిన నాయకులకు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. బీసీ బిడ్డ, మనలో ఒకరిగా ఉండే కాసాని జ్ఞానేశ్వర్కు మనమంతా అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఆయన జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంత అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. వ్యక్తిగతంగా అనేక మందిని ఆదుకున్నారు.
– బుగ్గారాపు దయానంద్, ఎమ్మెల్సీ
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను బరిలోకి దింపినందుకు కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆశీర్వదించి గెలిపిస్తే.. మీలో ఒక్కడిగా ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. సాధ్యం కాని హామీ లిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి. వంద రోజు ల్లో ఆ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రణాళిక లేని పాలన సాగుతున్నది.
-కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినప్పుడే విజయం ఖాయమైంది. కేసీఆర్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వంద రోజులు గడిచినా రేవంత్ సర్కారు ఒక్క హామీనీ నెరవేర్చలేదు. వ్యవసాయాన్ని గాలి కొదిలేసింది. విద్యుత్తు కోతలతో అన్నదాతలు అల్లాడుతున్నారు.
-వాణీదేవి, ఎమ్మెల్సీ
కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి వంద రోజులు గడిచినా ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. షాదీముబారక్, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఏమైంది. రైతుబంధు డబ్బులు బ్యాంకుల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. సాగునీరు లేక రైతన్నలు అల్లాడుతున్నారు. విద్యుత్తు కోతలతో అవస్థలు చెప్పలేనివి. కేసీఆర్ హయాంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నారు. 96 కులాలను ఏకం చేసి బీసీ సామాజిక వర్గాలకు ఏకతాటిపైకి తెచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ను రానున్న లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
-యెగ్గ్గె మల్లేశం, ఎమ్మెల్సీ