అత్తాపూర్ : పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీయం రిలీఫ్ఫండ్ వరంలా మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. శనివారం ఆయన అత్తాపూర్ డివిజన్ పరిధిలోని పాండురంగానగర్కు చెందిన లక్ష్మి అనే బాధితురాలికి 3లక్షల సీయం రిలీఫ్ఫండ్ చెక్ను అందజేశారు.
బాదితురాలు లక్ష్మి గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందింది. అనంతరం అందుకు సంబంధించిన బిల్లులను జత చేసి సీయంరిలీఫ్కు ధరఖాస్తు పెట్టుకోవడంతో ఎమ్మెల్యే బాధితురాలి పరిస్థితి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి 3లక్షలను మంజూరు చేయించారు.
ఇందుకు సంబందించిన చెక్ను శనివారం పాండురంగానగర్లోని లక్ష్మి ఇంటికి వెళ్ళి చెక్ను అందజేసి అండగా ఉంటానని ఆయన దైర్యం చెప్పారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చి చెక్ అందించడంతో కుటుంబసభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ.. పేదలకు వైద్య సహయం అందించేందుకు సీయం ఆర్ఎఫ్ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ఆసుపత్రులలో లక్షలు ఖర్చుచేసిన బాధితులు సీయంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవాలని లేదా సంబంధిత పత్రాలను తన కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేందర్ రెడ్డి, అమరేందర్, డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, సత్యనారాయణ గౌడ్, మోహన్రెడ్డ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.