శంషాబాద్ రూరల్ : సమతామూర్తి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం సమతామూర్తి ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో రామేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాం శంషాబాద్ మండలంలో నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని వివరించారు. హైదరాబాద్ నగరానికి రామానుజాచార్యుల విగ్రహాం తనమానికంగా ఉంటుందన్నారు.
స్వామివారిని దర్శించుకున్న వారిలో జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ నీరటి తన్విరాజు, చైర్మన్లు సుష్మ, వెంకటేశ్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, గణేష్గుప్త, మంచర్ల మోహన్రావు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.