మైలార్దేవ్పల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్లోని ఎన్ఎస్ఆర్ కిక్ బాక్సింగ్ ఆకాడమీ విద్యార్థులు ఇటీవల పలు పోటీల్లో పథకాలు సాధించారు.
కాగా వారంతా సోమవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. పలువురు విద్యార్థులు బంగారు ,వెండి ,కాంస్య పథకాలు సాధించినట్లు ఆకాడమీ కోచ్ మామిళ్ల సంతోష్ యాదవ్ ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ చిన్నారులను,బాక్సింగ్ కోచ్ సంతోష్ యాదవ్ను సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చిన్ననాటి నుండి విద్యార్థులు పలు క్రీడలలో ప్రాధాన్యత చూపడంతోనే రాష్ట్ర స్థాయిలో అవకాశాలు వస్తాయని తెలిపారు.అలాగే క్రీడలతో పాటు చదువులోను ప్రతిభ కనబరుచాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముకీత్ చంద్రా,రాజేష్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.