శంషాబాద్ రూరల్ : తెలంగాణలో బీజేపీకీ స్థానంలేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్(Mla Prakash Goud ) అన్నారు. గురువారం శంషాబాద్ మండలంలోని అలీకోల్తండా గ్రామ సర్పంచ్ రేణుక రాజునాయక్తో పాటు వార్డు సభ్యులు బీజేపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు లేకపోయిన కొంతమంది నాయకులు బీజేపీ (BJP) అధికారంలోకి వస్తుందని గొప్పలు చెప్పుకుంటూ కాలంగడుపుతున్నారని విమర్శించారు.
ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయకుండా కేవలం కులాలు, మతాల పేరుతో ప్రజలకు రెచ్చగొడుతున్న బీజేపీకి తెలంగాణలో స్థానంలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు . తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు.
కల్యాణలక్ష్మి ( Kalyanalaxmi ), షాదీముబారక్ ( Shadi Mubarak ), రైతు బంధు, రైతు బీమా, మిషన్కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్టు, వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఆసార ఫించన్లు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు గుండెలో పెట్టుకొని చూసుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు సతీష్, దావణాకర్గౌడ్, శ్రావణ్గౌడ్, గూడల కృష్ణగౌడ్, రవీందర్నాయక్, మురళీగౌడ్, నాయకులు పాల్గొన్నారు. గ్రామాభిృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరినట్లు సర్పంచ్ రేణుక రాజునాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం పాలన అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని వివరించారు.