మల్కాజిగిరి, అక్టోబర్ 27: టీఆర్ఎస్ పాలనలోనే ప్రజల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఓల్డ్ అల్వాల్ వీబీఆర్ గార్డెన్లో మల్కాజిగిరి నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే జెండాను ఆవి ష్కరించి.. మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు, అట్టడుగువర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారన్నారు. రాష్ట్రంలోనే రైతు బంధు అమలు కావడంతో రైతులకు భరోసా వచ్చిందన్నారు.
మల్కా జిగిరి నియోజకవర్గ అభివృద్ధికోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశామని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు ఉంటుం దని, నిరుత్సాహ పడవద్దని అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గానికి నిధుల కొరతలేని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. పేద కుంటుంబలోని ఆడ పిల్ల పెండ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1,01,116ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని అన్నారు.
సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి, వారి పేర్లు నమోదు చేయించి.. ప్రభుత్వ ఫలాలు వారికి అందేలా కృషి చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, విపక్షాల కుతంత్రాలను తిప్పికొడతామన్నారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ ద్విశాబ్ది ఉత్సవాలకు దాదాపు పది వేలమంది వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేంకుమార్, రాజ్ జితేంద్రనాథ్, సునీతారాముయాదవ్, మీనా ఉపేందర్రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, మాజీ కో-ఆప్షన్ మెంబర్ జ్యోతిగౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, అధికార ప్రతి నిధి జీఎన్వీ సతీశ్కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ గుండా నిరం జన్, ప్రభాకర్, పరుశరాంరెడ్డి, శ్రీనివాస్, బలవంతరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అనిల్కిశోర్, కొండల్రెడ్డి, బలవంతరెడ్డి, జ్యోతియాదవ్, బబిత, కవిత, గాయత్రి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.