మల్కాజిగిరి, అక్టోబర్ 25: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరింత ఉత్సాహాన్ని కలిగించిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం హైటెక్స్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి కార్పొరేటర్లు, సర్కిల్ అధ్యక్షులతో పాటు నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రెండు దశాబ్దాలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి విజయం సాధించడం గర్వకారణమని అన్నారు.
పేదల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారని అన్నారు. గత ఏడేళ్లలో ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేయాలని అన్నారు. ప్లీనరీ విజయవంతం కావడానికి సహరించిన నాయకులు, కార్యర్తలకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, సునీతరాము, మీనా ఉపేందర్రెడ్డి, శాంతిశ్రీనివాస్రెడ్డి, రాజ్ జితేంద్రనాధ్, సబితాకిశోర్, మాజీ కో ఆప్షన్ మెంబర్ జ్యోతిగౌడ్, అధికార ప్రతినిధి సతీశ్కుమార్, గుండా నిరంజన్, పిట్టల శ్రీనివాస్, సత్యమూర్తి, పీవీ సత్యనారాయణ, సుమలత, లీలా, శ్రీనివాస్గౌడ్, అనిల్కిశోర్, కొండల్రెడ్డి, బలవంతరెడ్డి, ప్రభాకర్, సయ్యద్ మోసిన్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
నేరేడ్మెట్, అక్టోబర్ 25 : టీఆర్ఎస్ 20 ఏండ్ల గులాబీ జెండా పండుగ వేడుకల్లో భాగంగా సోమవారం హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశానికి మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, బజార్సాయి, పార్థసారధి , నేరేడ్మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డి, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కే. ఉపేందర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహత్యవర్దన్, చెన్నారెడ్డి, శివకుమార్ వెళ్లారు.