మల్కాజిగిరి, అక్టోబర్ 24: ఇరుకైన బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ఇబ్బందులతో సతమత మవుతున్న వెస్ట్ వెంకటాపురం వాసులకు త్వరలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి మోక్షం లభించనున్నది. అల్వాల్ సర్కిల్ వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో ఉన్న నాలాపైన 1975లో మట్టితో రోడ్డు వేశారు. అల్వాల్ నుంచి మౌలాలికి నీటి పైపులైన్ వేయడానికి వాటర్వర్క్స్ అధికారులు ఈ రోడ్డును ఉపయోగించేవారు. అప్పట్లో ఇక్కడ అన్ని పొలాలు ఉండేవి. రోడ్డును వేయడానికి అప్పటి వ్యవసాయ దారులు స్వయంగా ట్రాక్టర్తో మట్టిపోసి రోడ్డు వేయడానికి వారు కృషిచేశారు.
1976లో అల్వాల్ పంచాయతీ వారితో పాటు వాటర్ వర్క్స్ శాఖ సంయుక్తంగా 12ఫీట్ల వెడల్పుతో చిన్నపాటి కల్వర్ట బ్రిడ్జిని కట్టారు. అప్పట్లో ఉన్న జనసాంద్రతకు సరిపోయింది. అయితే కాలానుగుణంగా వెస్ట్ వెంకటాపురంలో ఉన్న పొలాలను లే ఔట్లుగా చేసి ప్లాట్లను చేసి అమ్మారు. దీంతో చాలామంది ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి వేగంగా అభివృద్ధి చెందిన కాలనీలకు 1985లో ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించింది.
దీంతో జనసాంద్రత ఎక్కువ కావడంతో పాటు ఆర్టీసీ బస్లు, ప్రైవేటు కాలేజీల బస్లు, కార్లు, ఆటోలు, బైక్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజూ వెస్ట్ వెంకటాపురం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో ఉద్యోగులు, కాలేజీ, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోజూ నరకయాతన పడుతున్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించడంపై దృష్టిసారించింది.
వెంటనే అధికారులతో సర్వే చేయించి ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశాలు జారీచేశారు. బ్రిడ్జి వెడల్పు కోసం దాదాపు రూ.1.40కోట్లు అవుతుందని అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. నివేదిక పరిశీలించిన ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి వెడల్పుతో పాటు వాటర్ పైపులైన్లకు ఇబ్బందులు జరుగకుండా బ్రిడ్జిని నిర్మించడానికి రూ.1.40కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణ ప్రణాళిలను అధికారులు సాంకేతిక నిపుణులతో పరిశీలిస్తున్నారు. వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో ఉన్న బ్రిడ్జిని రూ.1.40కోట్లతో విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అధికారుల బ్రిడ్జి పనులు ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియను త్వరలో పూర్తిచేస్తామన్నారు.
బ్రిడ్జి వెడల్పు పనులు వేగంగా పూర్తి చేస్తాం. అల్వాల్ వెస్ట్ వెంకటాపురం వాసుల చిరకాల కోరిక త్వరలో కార్యరూ పం దాల్చనుంది. బ్రిడ్జ్జి వెడల్పు కోసం ప్రభుత్వం రూ.1.40కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం బ్రిడ్జి వెడల్పుకు గ్రీన్ సిగ్నం ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు టెండర్లు పిలిచారు. అయితే సాంకేతికంగా వాటిని తరస్కరించారు. త్వరలో మరోసారి టెండర్లు పిలవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో స్థానికులు బ్రిడ్జి వెడల్పు చేయాని కోరారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో స్థానికులు ప్రభుత్వానికి సహకరించాలి.
– ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు