మల్కాజిగిరి, సెప్టెంబర్ 23 : మల్కాజిగిరి నియోజకవర్గంలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి మౌలిక వసతులు కల్పిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ పీవీఎన్ కాలనీలో బాక్సు డ్రైనేజీ పనులను కార్పొరేటర్ ప్రేమ్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కొన్ని కోట్లు నిధులు తీసుకువచ్చి వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే మురికివాడల్లో నాలా, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు తదితర సమస్యలు పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో జీఎన్వీ సతీశ్కుమార్, గుండా నిరంజన్, బాబు, కిశోర్ పాల్గొన్నారు.