చిక్కడపల్లి, జనవరి 1 : బాగ్లింగంపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో దాత సాయంతో ఏర్పాటు చేస్తున్న షేడ్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నా రు. ఈ సందర్భంగ దాత సుమన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రవిచారి, బబ్లూ, డివిజన్ ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, దేవాలయం వ్యవస్థాపక వైస్ చైర్మన్ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ధర్మరాజు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సాయిగ్రూప్స్ 26 వార్షికోత్సవం సోమవారం గాంధీనగర్ ఆ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాజ్యాసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్కు హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాతూ.. ప్రస్తత సమాజంలో ప్రైవేట్ సెక్యూరిటీ కీలకంగా మారిందన్నారు. అపార్మెంట్ మొదలు ఏటీఎంలు బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆస్తులను ప్రైవేట్ సెక్యూరిటీ రక్షిస్తుందన్నారు. సాయిగ్రూప్స్ చైర్మన్ డి.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సెక్యూరిటీ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు మురాహరిగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, టీ.కే.ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.