కవాడిగూడ, మార్చి 27: ముషీరాబాద్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ హయాంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, తాము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ది చేసినట్లు ఏ ప్రజా ప్రతినిధి అయినా నిరూపిస్తే రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎమ్మెల్యే ము ఠా గోపాల్ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడ లోయర్ ట్యాంక్బండ్లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో కవాడిగూడ డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్తో కలసి మొదటగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ నియోజక వర్గంలో నాలుగేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని అన్నారు. నియోజక వర్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అంతర్గత రోడ్లను ఆధునీకరించినట్లు తెలిపారు. పురాతన డ్రైనే జీ, మంచినీటి పైప్లైన్లను తొలగించి జనాభాకు అనుగుణంగా పైప్లైన్ల ఆధునీకరణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
హుస్సేన్ సాగర్ నాలాతో పాటు పద్మకాలనీలో ఉన్న కచ్చామోరీ నాలా ప్రహరీ నిర్మాణానికి, నల్లపోచమ్మ దేవాలయం వద్ద నాలా ప్రహరీ స్లాబ్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్లూక్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, మాజీ కార్పొరేటర్లు టి. రవీందర్, ముఠా పద్మానరేశ్, మాచర్ల పద్మజ, కవాడిగూ డ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, రాష్ట్ర నాయకుడు కల్వ గోపీ, ముషీరాబాద్ నియోజక వర్గంలోని ఆరు డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు వై. శ్రీనివాస్రావు, రాకేశ్కుమార్, ఆర్. మోజెస్, నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు కాటారం దినేశ్, సానం చంద్రశేఖర్గౌడ్, షరీఫొద్దీన్, పెంటారెడ్డి, ఎస్. యాదగిరి, ముకుందరెడ్డి, ముఠా నరేశ్, రాంచందర్, గోవింద్, దుర్గ స్వామి, ప్రవీణ్గౌడ్, బి. విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.