ముషీరాబాద్ (హైదరాబాద్ ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్ఆర్టీసీ) ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపట్టి ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముషీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ( MLA Mutha Gopal ), డిపో మేనేజర్ కిషన్రావు ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో 43వేల మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్( CM KCR ) సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపర్చి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీని విలీనం చేశారని అన్నారు.
కార్మిక, ఉద్యోగ వర్గాల సంక్షేమాన్ని కోరి అన్ని వర్గాలు హర్షించే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామావతారం, వర్కింగ్ ప్రెసిడెంట్ నేత సీసా నర్సయ్యగౌడ్, అయిత రాజు వెంకటేశ్వర్లు, ఎండీ కలియుముల్లా, పాపరాజు, బిఆర్ఎస్ నాయకులు మోజస్, దామోదర్రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.