చిక్కడపల్లి, జూలై 13 : బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసిందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ సంజయ్ నగర్ బస్తీలోని ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠాజైసింహ, దేవాలయం అధ్యక్షుడు ఆర్.జయదేవ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్, సంతోష్ కుమార్, సీనియర్ సీపీఐ నాయకుడు, పాలమూరు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి బి.వెంకట్స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బోనాల పండుగను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావనీవినయ్కుమార్ అన్నారు. మంగళవారం డివిజన్లోని పలు అమ్మవారి దేవాలయాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోనాల పండుగ నేపథ్యంలో అమ్మవారి దేవాలయాల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నామన్నారు. పలు దేవాలయాల వద్ద ప్యాచ్వర్క్ పనులు చేయిస్తున్నామన్నారు. దేవాలయాల పరిసరాలను శుభ్రం చేయిచడం, శానిటేషన్ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎ.వినయ్కుమార్, ఉమేశ్, రహమత్ అలీ, స్థానికులు శ్రీనివాస్ యాదవ్, చందు, మల్లేశ్ రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.