ముషీరాబాద్, సెప్టెంబర్ 21: అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాల అమలుతో ముందుకు సాగుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ అమలులో భాగంగా దళితులకు పది శాతం అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాంనగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ పార్టీ నాయకుడు ఎర్రం శేఖర్, నాయకులు వి.సుధాకర్గుప్తా, ఆర్ మోజస్, గజ్జల సూర్యనారాయణ, ముదిగొండ మురళీ, సుబ్బారావు, ఇంద్రసేనారెడ్డి, దామోదర్రెడ్డి, మహేశ్, దీన్దయాల్రెడ్డి, రాజు చారి, సురేందర్, రాజశేఖర్గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, సెప్టెంబర్ 21 : స్వాతంత్య్ర సమర యోధుడు, మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని అశోక్ నగర్ బాపూజీ విగ్రహం వద్ద నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గోపాల్ పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిన మహనీయుడు బాపూజీ అన్నా రు. ఆయన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామూర్తి, కార్పొరేటర్లు పావని వినయ్కుమార్, సుప్రియ, సునీత, రచణ శ్రీ , టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు, తెలంగాణ ట్రిమ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకుడు వి.శ్రీనివాస్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, టీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, సంఘం అధ్యక్షుడు సంజీవ్ కుమార్, జర్నలిస్టు నర్సింగ్ రావు నివాళి అర్పించారు.