ముషీరాబాద్, సెప్టెంబర్ 20 : పార్టీ కార్యకర్తల ఏకాభిప్రాయ సాధనతో డివిజన్ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. వారం రోజులుగా కొనసాగుతున్న బస్తీ కమిటీల ఎంపిక ప్రక్రియలో మహిళలకు చోటు కల్పించాలని పార్టీ డివిజన్ స్థాయి ఎన్నికల ఇన్చార్జులకు సూచించారు. సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరు డివిజన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, డివిజన్ల ఇన్చార్జులు పాల్గొనగా ఆయా డివిజన్లలో బస్తీ కమిటీల ఏర్పాటు ప్రకియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు ఏర్పాటు చేశారని వాకబు చేసిన ఎమ్మెల్యే మరో రెండు రోజుల్లో పూర్తి స్థా యి బస్తీ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బస్తీ కమిటీల కోసం ఎన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉందని, ఏకాభిప్రాయ సాధన కోసం వాయిదా వేశామని పార్టీ ఇన్చార్జులు తెలుపగా వెంటనే స్థానిక సీనియర్ నేతలతో సమన్వయం చేసుకొని కమిటీలను ఏర్పాటు చేయాల్సిదంగా కోరారు. పార్టీ నిర్మాణంతోపాటు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేసే వారికి ప్రాధాన్యత కల్పించాల్సిందిగా సూచించారు. బస్తీ కమిటీల ఎన్నిక సందర్భంగా ప్రజలనుంచి వచ్చిన పలు ఫిర్యాదులను నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
త్వరలో డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని డివిజన్ కమిటీలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీల నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. డివిజన్ల వారీగా, బూత్ స్థాయి, బస్తీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు 51 శాతం ఉండేలా చూస్తామన్నారు. పోటీ అధికంగా ఉన్న బస్తీలు, జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల రెండు, లేక మూడు కమిటీలను ఎంపిక చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, పలు డివిజన్ల అధ్యక్షులు శ్యామ్సుందర్, రాంచందర్, మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శులు సురేందర్, వై.శ్రీనివాస్, వల్లాల శ్యామ్యాదవ్, పార్టీ డివిజన్ల ఇన్చార్జులు వి.సుధాకర్గుప్త, ఆకుల శ్రీనివాస్, మాధవ్, దీన్దాయాళ్రెడ్డి, డి.శివముదిరాజ్, సుబ్బారావు, మల్లీకార్జున్రెడ్డి, నర్సింగ్రావు, నేత శ్రీనివాస్, గోక నవీన్, బల్వీర్, నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, ప్రేమ్కుమార్, మాధవి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో జరుగనున్న డివిజన్ కమిటీల ఏర్పాటు కోసం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గోపాల్ ప్రకటించారు. కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, సుబ్బారావు, శ్యామ్సుందర్, మునువర్ చాంద్లను నియమించినట్లు తెలిపారు. వీరు పార్టీ డివిజన్ కమిటీల ఎన్నికల సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.