ముషీరాబాద్/ కవాడిగూడ/ చిక్కడపల్లి, సెప్టెంబర్ 13: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం వినాయక నవరాత్రుల సందర్భంగా భోలక్పూర్ డివిజన్లోని దామోదరం సంజీవయ్యనగర్లో బస్తీవాసులు మజ్జిగ మల్లేశ్యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా గణనాథుడికి పూజలు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎ. శంకర్గౌడ్, బస్తీ వాసులు లత, సాయికృష్ణ, మహేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రాజు, కేఎం సాయి, సునిల్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీ ఆభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. స్థానికుడు మహేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, శ్యామ్సుందర్, సురేందర్, సయ్యద్ అస్లాం, మాధవ్, రాజు, ఎంఎల్ శ్రీధర్, ప్రేమ్కుమార్, సుబ్బారావు, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు రఘు, మనోహర్ పాల్గొన్నారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా సోమవారం కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్లో కాలనీలో కేఎం సాయిరాం ఆధ్వర్యంలో వినాయకుడి మండపం వద్ద భక్తులను అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు హాజరై అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగా శ్రీనివాస్, లక్ష్మణ్, వెంకటేశ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి : శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం చిక్కడపల్లిలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దర్శించుకున్నారు గాంధీనగర్ ఆంధ్రాకేఫ్ చైరస్తా సమీపంలో మహాత్మా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.