కవాడిగూడ, సెప్టెంబర్ 3: ముషీరాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ముషీరాబాద్ విద్యా మండలి డిప్యూటీ ఈఓ సామ్యూల్ రాజ్, పాఠశాల ప్రధానోప్యాయులు ఎం.నరేందర్ యాదవ్లలో కలిసి పాఠశాల తరగతి గదుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించే పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజక వర్గం ప్రజల కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలను కూల్చివేసి ఆధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వంగల నర్సింగ్, పరుశురామ్, భిక్షపతి, మున్వర్ చాంద్, ఎయిర్టెల్ రాజు, కేఎం సాయి, కళ్యాణ్, ఎస్ఆర్డీ సంస్థ ప్రతినిధులు పార్వతి, శివరాణి, పాఠశాల సిబ్బంది దేవిడ్, రతన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్, సెప్టెంబర్ 3 : ముషీరాబాద్ డివిజన్ ఈస్ట్ ఎంసీహెచ్ క్వార్టర్స్లోని మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించి పరిశీలించారు. కాంప్లెక్స్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం పట్ల స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. క్రీడా భవనంలో ఆయా విభాగాల ఆటగాళ్ల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, నేత శ్రీనివాస్, మాదవ్, శ్యామ్సుందర్, దీన్దయాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, సెప్టెంబర్ 3 : పారిశుధ్య కార్మికుల సేవలు వేలకట్టలేనివని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, డీఎంసీ హరికృష్ణ, ఏఎంఓహెచ్ హేమలతలు పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతకు ప్రధాన్యతనిస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సేఫ్టీ కిట్లను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, పోతుల శ్రీకాంత్, పరశురాం, రాకేశ్కుమార్, మారిశెట్టి నర్సింగ్, ఆకుల శ్రీనివాస్, శివాసింహ, ఎస్టీ ప్రేమ్, హనుమంతు, సురేశ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.