చిక్కడపల్లి, ఆగస్టు23 : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వే యించుకోవడంతో పాటు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ము ఠా గోపాల్ ప్రజలను కోరారు. సోమవారం గాంధీనగర్ డివిజన్లోని పీపుల్స్ పార్కులో ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం ద్వారా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు.
ప్రతి కాలనీ, బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ముఠా జైసింహ, సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, ప్రభాకర్, మురళీప్రసాద్, శ్రీకాం త్, మారిశెట్టి నర్సింగ్రావు, ఆకుల శ్రీనివాస్, ఎస్టీ ప్రేమ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా రాంనగర్ డివిజన్లోని పోచమ్మ దేవాలయం గ్రంథాలయం, అడిక్మెంట్ డివిజన్లోని వడ్డెర బస్తీలో, ముషీరాబాద్ శివాలయం దగ్గర వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జైసింహ, ఏఎంఓహెచ్ హేమలత, డీపీఓ రత్నరాణి, డాక్టర్ పద్మజ, డాక్టర్ కృష్ణమోహన్, మోజస్, ఇంద్రసేనారెడ్డి, పెంటారెడ్డి, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, ముఠా శివసింహ పాల్గొన్నారు.
కవాడిగూడ : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజక వర్గంలోని భోలక్పూర్ డివిజన్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలోకొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కట్టడికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించోని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్ సుప్రియ నవీన్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, ముఠా జయసింహ, ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలత, డీపీఓ రత్నరాణి, డాక్టర్ పద్మజ, డాక్టర్ కృష్ణమోహన్ రావు, పీహెచ్ఎన్ భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ భోలక్పూర్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, ఎ. శంకర్ గౌడ్, గాంధీనగర్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, రాంనగర్ అధ్యక్షుడు శ్యామ్సుందర్, ఆర్. శ్రీనివాస్, గోవింద్రాజ్, నాయిని ఆనంద్, ప్రభాకర్, పోతుల శ్రీకాంత్, సరేందర్, కేఎం సాయి పాల్గొన్నారు.