చిక్కడపల్లి, ఆగస్టు22: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను, మతాలను సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా బోనాల ఉత్సవాలకు పెద్ద ఎత్తున్న నిధులు మంజూరు చేశారని తెలిపారు. గాంధీనగర్ డివిజన్ జవహర్నగర్ లోని నల్లపోచమ్మ, ఉప్పలమ్మ దేవాలయాలకు సంబంధించిన ముఖ ద్వారం నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నా రు. నియోజకవర్గం పరిధిలో అనేక దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు. యువ నాయకుడు ము ఠా జైసింహ, టీఆర్ఎస్ నాయకుడు, ముఖ ద్వారం దాత శ్రీనివాస్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకుడు వినయ్కుమార్, కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు గుర్రం శంకర్, దేవాలయం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు సాయికీర్తి, మారిశెట్టి నర్సింగ్ రావు, ప్రభాకర్, యాదగిరి, రాము, బాలరాజు, ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, పరశురాం, గుండు జగదీశ్బాబు, నాయకుడు రాకేశ్ పాల్గొన్నారు.