కవాడిగూడ, ఆగస్టు 20 : త్యాగానికి ప్రతీక మొహర్రం అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మొహర్రం (పీర్ల పండుగ) ఉత్సవాల సందర్భంగా శుక్రవారం భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్, ఆషీర్ఖానాలో ముస్లింలు మొహర్రం వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీర్ల ఊరేగింపులో పాల్గొని దట్టీలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్పూర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షుడు ఏ శంకర్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.