చిక్కడపల్లి, ఆగస్టు 17: గాంధీనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల నూతన రోడ్ల నిర్మాణం చేపట్టారు.. పనులు మొత్తం పూర్తి కావడంతో రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా హెబ్రోన్ చర్చి నుంచి వై జంక్షన్ వరకు రూ.49.50 లక్షలతో నూతన వీడీసీసీ రోడ్డు, వై జంక్షన్ నుంచి ఆంధ్రకేఫ్ వరకు రూ. 35 లక్షలతో రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. గత 20 ఏండ్లుగా రోడ్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారాయని… దీంతో నిత్యం నరకం అనుభవించామ ని… తెలంగాణ ప్రభుత్వం డివిజన్ల అభివృద్ధిలో భాగంగా నిధులు మంజూరు చేయడంతో నూతనంగా రోడ్లు వేశారని స్థానికులు తెలిపారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా నూతన రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందులో భాగంగా రోడ్లతో పాటు నూతన డ్రైనేజీ పైప్లైన్ పనులు చేపట్టి..సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – ముఠా గోపాల్ , ఎమ్మెల్యే
ముషీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిని గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది. నూతన రోడ్లతోపాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఎవరు కూడా రోడ్లను పట్టించుకోలేదు.. తెలంగాణ ప్రభుత్వంలో రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టి.. పనులు పూర్తి చేయడం ఆనందంగా ఉంది. – సాయి, న్యాయవాది