ముషీరాబాద్, ఆగస్టు 11: కొత్త రేషన్ కార్డుదారులకు ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే రేషన్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం రాంనగర్ డివిజన్ దాయరమార్కెట్లో లబ్ధిదారులకు రేషన్ కార్డు లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరి కాకుండా కార్డు అందించిన నెలలోనే రేషన్ పంపిణీ చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో నిజమైన అర్హులను గుర్తించి పారదర్శకంగా రేషన్ కార్డులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ఆర్.మోజస్, ఎర్రం శేఖర్, నాగభూషణం, దీన్దయాశ్రెడ్డి, ప్రసాద్, రుద్రప్రవీణ్, రజినీకాంత్, రాజుచారి, ఎంవి. జనార్దన్, మహేశ్, శ్రీనివాస్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.