కవాడిగూడ, ఆగస్టు 10: ద్విచక్ర వాహనాల మెకానిక్ల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మెకానిక్లను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజక వర్గంలో సుమారు 800 మంది టూ వీలర్ మెకానిక్లు ఉపాధి పొందుతున్నారని అన్నారు. వారిని ఆదుకోవడానికి కార్పొరేషన్ నుంచి సబ్సిడీ రుణాలను అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. మెకానిక్లు ఐక్యంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ధ్రువపత్రాన్ని, మెకానిక్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి బల్ల ప్రశాంత్, కోశాధికారి సంతోష్, సభ్యులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.