చిక్కడపల్లి,ఆగస్టు9: అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నా రు. ఇందులో భాగంగానే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు పొందిన వారందరికీ ఈ నెల నుంచే బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంక ఎవరైనా రానివారు ఉంటే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. 624 షాప్ నిర్వాహకుడు రాజు, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, శ్రీకాంత్, గుండు జగదీశ్ బాబు, ఆకుల శ్రీనివాస్, రాకేశ్, భాస్కర్, రవిశంకర్ గుప్తా, జహంగీర్, హన్మంతు, వెంకటేశ్, కిరణ్కుమార్, ఎస్టీ ప్రేమ్, సుధాకర్ పాల్గొన్నారు.