ముషీరాబాద్, జూలై 22: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 24న ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించతలపెట్టినట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పార్టీ శ్రేణులు సమాజహితం కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిం చాలని పిలుపునిచ్చారు. గురువారం తన కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు. బస్తీలు, కాలనీల్లో ఎక్కడ ఖాళీ జాగ ఉన్నా గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. పేదలకు అన్న, వస్త్రదానాలు, దవాఖానలు, ఆశ్రమాలలో పండ్లు పంపిణీ, ఆలయాలు, మసీదు, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి పార్టీ పరంగా చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా చూడాలని, పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, శ్యామ్సుందర్, బింగి నవీన్కుమార్, శ్రీనివాస్ గుప్త, ముచ్చకుర్తి ప్రభాకర్, సుధాకర్గుప్త, ఆర్ మోజస్, రవియాదవ్, మాధవ్, దీన్దయాళ్రెడ్డి, శివముదిరాజ్, సాంబశివరావు, బి.శ్రీనివాస్రెడ్డి, ఎర్రం శేఖర్, ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.