ముషీరాబాద్, జూలై 6 : పర్యావరణ పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం అడిక్మెట్ డివిజన్ దయానంద్నగర్, ముషీరాబాద్ డివిజన్ కళాధర్నగర్ పార్కులో హరితహారంలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు సురేందర్, రాజా దీన్దయాల్రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. బస్తీలు, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటి కాలుష్య నివారణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బి.హేమలతారెడ్డి, భక్తియారి, డి.శివముదిరాజ్, గోవింద్, లింగాల శ్రీకాంత్ గౌడ్, అరుణ్, అభినందన్ యాదవ్, బాల్రాజ్, నేతలు శ్రీనివాస్, బి.శ్రీనివాస్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, సయ్యద్ అస్లాం, సుబ్బారావు, అనురాధ, ప్రేమలతారెడ్డి, హరీశ్, టక్కర్ పాల్గొన్నారు.
అడిక్మెట్ డివిజన్ రాంనగర్ గుండులోని శ్రీశివ సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం మండల పూజ, చండీ హోమం కార్యక్రమాలు వైభంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సత్యనారాయణ, హనుమంతు యాదవ్, నర్సింహారెడ్డి, విరించి బాబు, రామకృష్ణ శర్మ, మాజీ కార్పొరేటర్ బి.హేమలతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బి.శ్రీనివాస్రెడ్డి, సురేందర్, నేత శ్రీనివాస్, మాధవ్, మల్లికార్జున్రెడ్డి, ఎ.శ్రీనివాస్, హరీశ్, జ్ఞానీ, శ్రీకాంత్, అనురాధ, ప్రేమలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.