చిక్కడపల్లి, జూలై3: దేవాలయాల అభివృద్ధికి భక్తులు ముందుకురావాలని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం లక్ష్మీ గణపతి దేవాలయంలో భక్తులు కౌస ల్య బంగారు నగలు భద్రపర్చడానికి లాక ర్, నందిత హర్షవర్ధన్ స్వామి వారికి వెండి కిరీటాన్ని ఎమ్మెల్యే ద్వారా దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఈఓ దీప్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, పున్న సత్యనారాయణ, రాఖేశ్ కుమార్, గుండు జగదీశ్, రవి శంకర్ గుప్త, సాయి చాణిక్యరెడ్డి, శ్రీధర్రెడ్డి, జహంగీర్, ఆలయ సభ్యులు రమణ మూర్తి, దశరథ్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.