ముషీరాబాద్, జూన్ 12: సీఎం సహాయ నిధి ద్వారా వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. శనివారం ముషీరాబాద్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రిలీప్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, హమ్మదుల్లా భక్తియారి, ఎయిర్టెల్ రాజు, జీ.రాజు, ప్రశాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, మల్లేశ్ యాదవ్, శ్రీకాంత్, శ్రీధర్చారి, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.