కవాడిగూడ, జూన్ 1: భోలక్పూర్లో జరుగుతున్న తాగునీటి పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్లోని ఇందిరానగర్లో జరుగుతున్న తాగునీటి పైపులైన్ నిర్మాణపు పనులను ఆయన జలమండలి డీజీఎం చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భోలక్పూర్లో జరుగుతున్న తాగునీటి పైపులైన్ నిర్మాణపు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. పైపులైన్ పనులు పూర్తి అయిన తరువాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీసీరోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, నా యకులు జునేద్ బాగ్దాది, రహీం, మక్బూల్, జబ్బా ర్, శ్రావణ్, అజీ పాషా, కళ్యాణ్ పాల్గొన్నారు.