ముషీరాబాద్, మే 16: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు రాష్ట్ర ప్రజలందరూ సహకరిస్తే త్వరితగతిన కరోనా నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగనున్నట్లు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు, వివిధ శాఖల సిబ్బంది కరోనా వ్యాప్తికి అడ్డుకుట్ట వేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆదివారం అడిక్మెట్ డివిజన్ పాపడ్గల్లీ, అడిక్మెట్లలో శానిటైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీల్లో కరోనా విస్తరించకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శానిటైజేషన్, పారిశుధ్య పనులు పటిష్టంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఇష్టం వచ్చినట్లు రోడ్లపైకి రాకుండా అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, శ్యామ్సుందర్, మాధవ్, సురేందర్, రాజు, అంజద్, లక్ష్మీపతి, చంద్రకాంత్, సురేష్, వెంకటేశ్, పవన్,గౌతమ్, శ్రీధర్, హర్షత్, వికార్ తదితరులు పాల్గొన్నారు.