మేడ్చల్, డిసెంబరు 3: మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అంచనాలకు మించి అత్యధిక మెజార్టీ సాధించి, తన పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ విజయం ఖాయమనే అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి 33419 మెజార్టీ సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి బీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని కొనసాగించింది.
మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించగా ప్రతి రౌండ్లో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదటి రౌండ్లో బీఆర్ఎస్కు 10814 ఓట్లు రాకగా కాంగ్రెస్కు 7901, బీజేపీ 1351 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్యాదవ్పై 2913 ఆధిక్యం కనబరిచారు. 8,15, 16వ రౌండ్లలో మాత్రం వరుసగా 349, 60, 396 ఆధిక్యం తగ్గింది.
తెలంగాణ వచ్చాక మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మూడు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 114235 ఓట్లు రాగా 43455 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్రెడ్డి గెలిచారు. 2018 ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి బీఆర్ ఎస్ నుంచి బరిలో నిలిచి 167324 ఓట్లతో విజయం సాధించారు. మూడో సారికూడా బీఆర్ఎస్ విజయం సాధించి తన పట్టు నిలుపుకుంది. చామకూర మల్లారెడ్డి 2014లో ఎంపీగా ఎన్నిక కాగా, 2018, 2023లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు.
ప్రజల తీర్పును శిరసావహిస్తాం. తనను గెలిపించిన మేడ్చల్ నియో జకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా. నేను చేసిన అభివృద్ధే నన్ను ఎమ్మె ల్యేగా గెలిపించారు. ప్రజలకు మరింత సేవ చేస్తా.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ల్లో ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకు అందేలా చూస్తాం. ప్రజలకు మంచి జరిగేలా చూస్తాం.
– ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి