ఎర్రగడ్డ, ఆగస్టు 29: అభివృద్ధి, సంక్షేమం వైపే ప్రజలు ఉన్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజుతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఉమ్మడి పాలనలో అభివృద్ధికి నోచుకోలేని ఎర్రగడ్డను ఆదర్శ డివిజన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని తెలిపారు.
కొన్ని రాజకీయ పార్టీలు మత రాజకీయాలు చేయటానికి పన్నుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వాళ్లలో రాజుతో పాటు రమేశ్, సాయికిరణ్, గౌస్పాషా, ధనుశ్, మల్లేశ్, చంటిబాలు, సాలమన్రాజు, యాదగిరి, శారద, సుజాత, యాదమ్మ, సక్కుబాయి తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, అజీమ్, సూరి తదితరులు పాల్గొన్నారు.