ఎర్రగడ్డ, సెప్టెంబర్ 18 : కార్యకర్తలు పార్టీకి మూల స్తంభాలని.. క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. టీఆర్ఎస్ ఎర్రగడ్డ డివిజన్ కమిటీల నియామక సమావేశం శనివారం స్థానిక లిమ్రా ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అన్ని రంగాల్లో డివిజన్ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు ఇంతకన్నా కావాల్సింది ఏమున్నది అని అన్నారు. ఇటువంటి వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు.
అభివృద్ధి పనుల విషయంలో ఎర్రగడ్డకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దశలవారీగా పలు పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. డివిజన్లోని ప్రతి ఇంటిపై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు. అనంతరం ఆయన డివిజన్ ప్రధాన కమిటీతో పాటు అనుబంధ కమిటీలను ప్రకటించారు. పార్టీ నేతలు గోపీనాథ్ను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు కంజర్ల పల్లవియాదవ్, గంట మల్లేశ్, మహ్మద్సర్దార్, మహ్మద్అహ్మద్, మహ్మద్ముస్తాక్, అజీమ్, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడుగా డి.సంజీవను నియమించారు. వరుసగా 3వ సారి అధ్యక్ష పదవిని చేపట్టాడు. ప్రధాన కార్యదర్శిగా షరీఫ్ఖురేషీ, ఉపాధ్యక్షులుగా జవహర్లాల్, భుజంగరావు, బద్రుద్దీన్, సయ్యద్స్రూల్, జ్ఞానేశ్వర్యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా సంతోష్గౌడ్, ఎం.అరుణ్కుమార్, నాగదేవి, సాయిలక్ష్మి, పి.జయంత్, ప్రచార కార్యదర్శిగా ఎం.రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా సి.బాలసూర్య, బి.బాలమణి, దారాసింగ్, వజ్రాల వాసు, రాజు, లక్ష్మిలను నియమించారు.
సాయిరూపేశ్, ఒమర్షాఖాన్(యూత్ విభాగం), జి.రమేశ్, పి.శ్రీకాంత్(బీసీ సెల్), కల్యాణి, సుజాత, సుధ(మహిళా విభాగం), ఒమర్షాఖాన్(మైనార్టీ సెల్), పి.చిన్నరాజు, కె.బాల్రాజ్(ఎస్సీ సెల్), సోమనాథ్నాయక్, పి.దేవేందర్నాయక్(ఎస్టీ సెల్), జి.రాము, గంట శ్రీనివాస్, జహంగీర్(మీడియా సెల్).
వెంగళరావునగర్, సెప్టెంబర్ 18 : పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం సోమాజిగూడ డివిజన్ ఇమామ్గూడలో కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ శ్రీనగర్ కాలనీ డివిజన్ నూతన కమిటీని, అనుబంధ కమిటీలను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన కాలంలో ప్రతిపక్షాల నేతలు ఇండ్ల నుంచి బయటకు కదల్లేదని, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పడు తిప్పికొట్టాలన్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ఏ రాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని చెప్పారు. అంతకు ముందు ఎల్లారెడ్డిగూలో డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్ భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే గోపీనాథ్కు ఘన స్వాగతం పలికారు.
టీఆర్ఎస్ శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా ఎండీ. రఫీక్ (అప్పుఖాన్)నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీరాములు, షేక్ ఫయాజ్, కె.మోహన్ బాబు, పాపయ్య, అవినాశ్గౌడ్, వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శిగా మధు, జాయింట్ సెక్రటరీగా ఎండీ ఫయా జ్, వై.వి.క్రిష్ణ, వినయ్, నజీర్ నియమితులయ్యారు.