వెంగళరావునగర్, ఆగస్టు 26 : ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ, శాలివాహన నగర్లో చేపడుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ కేంద్రాల్లోనే కాకుండా మొబైల్ కేంద్రాల ద్వారా కూడా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. బస్తీలు, కాలనీలు, సంతలు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్న మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలకు మంచి స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ సునీల్, ఖైరతాబాద్ సర్కిల్ ఇన్చార్జి ఎన్.రేవతి, నోడల్ ఆఫీసర్ చైతన్య, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, నాయకులు తన్నుఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్, సంతోశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.