ఎర్రగడ్డ, ఆగస్టు 14: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన శనివారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు 230 రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు తప్పా.. ప్రజల అభివృద్ధిపై ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు. బోరబండ, రహ్మత్నగర్ డివిజన్లకు రాబోయే 40 ఏండ్ల వరకు తాగునీటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా హిల్స్లో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరయ్యాయని.. సంబంధిత పనులు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు. బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ లాఠీ దెబ్బలకే జంకలేదు.. ఆ రెండు పార్టీల చౌకబారు వ్యాఖ్యలకు భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు ఎన్.విజయకుమార్, ఎం.ఆనంద్కుమార్, జి.లక్ష్మణ్గౌడ్, సరళ, రవినాయుడు, యూసుఫ్, ధర్మ, రమేష్నాయక్, కె.రవీందర్, బాబానాయక్, దేవమణి తదితరులు పాల్గొన్నారు.