బంజారాహిల్స్,జూలై 16: పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న పేదలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకంలో భాగంగా రహ్మత్నగర్ డివిజన్లో లబ్ధిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పత్రాలను అందజేశారు. హెచ్ఎఫ్నగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదలకు 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, వాటర్వర్క్స్ జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్,జూలై 16: ఎర్రగడ్డ డివిజన్ ప్రభాత్నగర్కు చెందిన సయ్యద్ ఖాదర్కు సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరైన రూ.48వేల చెక్కును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం అందజేశారు. డివిజన్ అధ్యక్షుడు సంజీవ తదితరులు పాల్గొన్నారు.