జూబ్లీహిల్స్,మే29: వ్యాక్సిన్తోనే కరోనా మహమ్మరిని అడ్డుకోవచ్చని, ప్రభుత్వం వేస్తున్న ఉచిత వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మొదటి డోస్, రెండు డోస్ వేసుకున్న వారికి కరోనా వచ్చే అవకాశమే లేదని పేర్కొన్నారు. యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని శనివారం కార్పొరేటర్ల బృందంతో కలిసి సందర్శించారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు సమన్వయంతో ప్రతి ఒక్కరికీ టోకెన్లు అందేలా చూడాలని, ఏ ఒక్కరూ కూడా టోకెన్ అందకపోవడం వల్ల టీకా వేయించుకోలేక పోయారన్న అపవాదు రాకూడదని అన్నారు. కార్పొరేటర్లు బండారి రాజ్కుమార్ పటేల్, దేదీప్యరావు, సీఎన్ రెడ్డి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు 738 మందికి, రెండో రోజు 839 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వినాయక్నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జువేరియ తెలిపారు. జీహెచ్ఎంసీ పంపిణీ చేసిన టోకెన్లతో వచ్చిన లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్ వేశామని ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ తెలిపారు.