బంజారాహిల్స్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన ఎల్వోసీ పత్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు.
వెంగళరావునగర్ డివిజన్కు చెందిన సర్దార్ మహేందర్ సింగ్ సర్జరీకి సాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కోరగా స్పందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రూ.2.50లక్షల విలువైన చికిత్సకు సంబంధించిన ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ పత్రాన్ని సోమవారం బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యరావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు ఆజయ్కుమార్, నాయకులు శ్యామ్ ముదిరాజ్, బాలకృష్ణ, చిన్న రమేష్, అజ్జూ సింగ్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.