జీడిమెట్ల, జూన్ 6 : పారిశ్రామిక రంగంలో ప్రపంచం చూపు తెలంగాణ వైపు చూస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెలంగాణ పారిశ్రామిక ప్రగతి వేడుకలు జీడిమెట్ల ఇండస్ట్రీయల్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ..జీడిమెట్ల ఇండస్ట్రీయల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జాతీపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇండస్ట్రీయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించా రు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లలో పారిశ్రామిక రంగం సాధించిన విజయాలను వివరిస్తూ ఏర్పా టు చేసిన ప్రత్యేక డాక్యుమెంట్ను వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ కృషి, చొరవతో పారిశ్రామిక రంగం పరు గులు పెడుతుందన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఎస్ ఐ పాస్ కింద 2,226 పరిశ్రమలకు వివిధ శాఖల నుంచి 4,650 అనుమతులు ఇప్పించడం జరిగిందన్నారు. 2,198 పరిశ్రమలు రూ.3,175 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి 33,708 మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్నారు. టీఎస్ ఐ పాస్ చట్టం అమలులో మేడ్చల్ జిల్లా 2019లో ఉత్త మ జిల్లా అవార్డు అందుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో 4,242 పరిశ్రమలుండగా గడిచిన పదేళ్లలో 2,198 పరిశ్రమలు స్థాపించబడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నియోజకవర్గం పరిధిలో పరిశ్రమల ద్వారా 62,259 మంది ఉపాధి పొందగా.. గడిచిన పదేళ్లలో 33,708 మంది ఉపాధి పొందుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకవర్గంలో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని అభివృద్ధి పథం లో ముందుకు సాగుతుందన్నారు. ఉత్తమ పారిశ్రామిక వేత్తలను శాలువా కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ మేడ్చల్ సిద్దిపేట జోనల్ మేనేజర్ బెల్లంకొండ మాధవి, జిల్లా పరిశ్రమల అసిస్టెంట్ డైరెక్టర్ నర్సిరెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ రెడ్డి, ఐలా కమిషనర్ ఎ.విజయ, పీసీబీ ఏఈ స్వప్న, జీడిమెట్ల ఇండస్ట్రీయల్ అసోసియేషన్ ప్రతినిధులు సదాశివారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, స్వామిగౌడ్, సత్యనారాయణ, వెంకట్ రాజంగౌడ్, పీడీఎస్ ఎన్ రాజు, ప్రవీణ్ రెడ్డితో పాటు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.