కుత్బుల్లాపూర్, జనవరి 27: నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించి కుత్బుల్లాపూర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బులాపూర్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలను అందించారు.