కుత్బుల్లాపూర్,అక్టోబర్22 : కుత్బుల్లాపూర్లో(Qutubullapur) లింక్రోడ్లను(Link roads) వెలుగులోకి తీసుకొచ్చి వాటిని వెంటనే అభివృద్ధి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆయా (MLA KP Vivekanand)విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం పేట్ బషీరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్), కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎన్హెచ్-44 హనుమాన్ టెంపుల్ ఫాక్స్సాగర్ మీదుగా రాంరెడ్డినగర్ ఇండస్ట్రీయల్ ఏరియా వరకు రూ.29 కోట్లు, కైసర్ నగర్ హనుమాన్ రెండి ఎల్లమ్మ బండ, మహదేవపురం వెంటర్నరీ హస్పిటల్ వరకు రూ.30 కోట్లతో లింకురోడ్డు అభివృద్ధి పనులు చేపట్టనుండగా దీంతో పాటుగా భూదేవిహిల్స్ లింకురోడ్డు పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. లింక్రోడ్లను సకాలంలో అభివృద్ధి చేయాలని, దీని ద్వారా ప్రధాన రోడ్లపై నిత్యం ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులకు సూచించారు.