అంబర్పేట, మార్చి 27 : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలలో నూతన సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బాగ్అంబర్పేట డివిజన్ రహత్నగర్లో రూ.15.50లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డితో కలిసి సోమవారం ఎమ్మెల్యే ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో గల బస్తీలు, కాలనీల్లో బీటీ, సీసీ, వీడీసీసీ కొత్త రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాలుగేండ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.58 కోట్లతో కొత్త రోడ్లను నిర్మించడమైందని తెలిపారు. రోడ్లతో పాటు మంచినీరు, డ్రైనేజీ పైపులైన్ పనుల ఆధునీకరణ కూడా చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నానని చెప్పారు. ఫుట్పాత్ల అభివృద్ధి, పార్కుల సుందరీకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జో రుగా సాగుతున్నాయని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని చెప్పారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, ప్రధానంగా కలుషిత మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేసి స్థానికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. అలాగే వర్షం వచ్చినప్పుడు నీరు సవ్యంగా పోయేలా నిర్మాణం ఉండాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల ని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో డీఈ దుర్గాప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు జమీల్ఖాన్, రమేశ్నాయక్, బి. నర్సింగ్రావుయాదవ్, నరహరి, శివ, బీజేపీ నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ : అంధత్వ రహిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగులో భాగంగా సోమవారం కాచిగూడలోని మున్నూరుకాపు సంఘంలో కాచిగూడ కార్పొరేటర్ ఉమాయాదవ్ కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు శిబిరాలను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ, వైద్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వంద రోజుల పాటు కొనసాగే ఈ కంటి వెలు గు కార్యక్రమం జూన్ 30వ తేదీతో ముగుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆకుల పాండురంగారా వు, కన్నె రమేశ్యాదవ్, కాచిగూడ డివిజన్ కంటివెలుగు ఇన్చార్జి డాక్టర్ మనోజ్రెడ్డి, డాక్టర్ దీప్తి, డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రీనివాస్, ఆర్. సంతోష్, భీంరాజ్, ఆనంద్రావు, రాజు, సతీశ్, అమ్రీన్, సునీత, సబిత, ఉమాదేవి, అమరావతి తదితరులు పాల్గొన్నారు.