అంబర్పేట/ గోల్నాక, అక్టోబర్ 29 : అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, నగరంలోనే అగ్రభాగాన నిలుపుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్లోని టీఆర్టీకాలనీ, అంజయ్యనగర్, సంజయ్గాంధీనగర్ తదితర ప్రాంతాలలో ఆయన డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చే పార్టీ ఎమ్మెల్యేగా ఉంటేనే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్గౌడ్, గోనె ప్రదీప్రావు, యూసుఫ్, కూర నరేందర్, రమణానాయుడు, విజయ్కుమార్, భూపతినాథ్, విజయేంద్రసాగర్, కిషన్రావు, గాలపల్లి శంకర్, మూర్తి, చంద్రప్రభ, ఇర్ఫానా సుల్తానా, క్రిస్టోలైట్, రేణుక, లావణ్య, స్వప్న పాల్గొన్నారు.
గడప గడపకూ ఎన్నికల ప్రచారం..
అంబర్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో గడపగడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓటర్లుకు వివరిస్తూ మళ్లీ తనను ఆశీర్వదించాలని ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. ఆదివారం కాలేరు వెంకటేశ్ అన్నపూర్ణనగర్ కాలనీలోని నల్లపోచమ్మ ఆలయంలో పూజ లు నిర్వహించి, అనంతరం అంబర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దార్థ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుతో కలసి అంబర్పేట డివిజన్ న్యూ అన్నపూర్ణనగర్, నరేంద్రనగర్, హైమద్నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంబర్పేట నియోజకవర్గంలో గత నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు జై కొడుతూ స్థానిక మహిళలు మంగళహారతులు ఇచ్చి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఓటర్లకు అందజేస్తూ మరో సారి తనను ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్, బీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, ఎర్రబోలు నరసింహరెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.