అంబర్పేట, మార్చి 10: బాగ్అంబర్పేట డివిజన్ భరత్నగర్లో రూ.14.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాగ్అంబర్పేట డివిజన్లోని చాలా బస్తీలలో ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గంలోని మిగతా డివిజన్లు కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట తదితర వాటిల్లో కూడా పురాతన డ్రైనేజీ పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్ వ్యవస్థను రూపొందించడమైందని తెలిపారు.
డ్రైనేజీ వ్యవస్థతో పాటు తాగునీటి పైప్లైన్ పనులను కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ పనులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కొత్తరోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు శివాజీయాదవ్, రమేశ్నాయక్, కోట్ల సంతోశ్, జె.బాల్రాజు, జ్ఞానేశ్వర్, నరేశ్, లక్ష్మణ్, సుధాకర్, నవీన్యాదవ్, సాయిరాం, దారయోబు, బాబు, రాకేశ్, స్వర్ణగౌడ్, అమరావతి తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణనగర్ పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కాలనీవాసులతో ఎమ్మెల్యే సమావేశమై పార్కు అభివృద్ధికోసం స్థానికల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కాలనీవాసుల అభిప్రాయం మేరకు పార్కును అన్ని విధాలుగా సుందరీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణనగర్ వాసులు బి.అశోక్, అఫ్రోజ్పటేల్, టెంటు చిన్న, దారయోబు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.