కాచిగూడ, సెప్టెంబర్ 20 : కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ సహకారంతో మోక్షం లభించింది. ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. రూ.40 లక్షల వ్యయంతో కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణ పనులను సోమవారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 12 ఏండ్లుగా కాచిగూడ రైల్వేస్టేషన్ నుండి ఆర్టీసీ క్వార్టర్స్కు వెళ్లే అండర్ బ్రిడ్జి రహదారి అధ్వానంగా తయారవడంతో బ్రిడ్జి రోడ్డును బాగు చేయాలని వాహనదారులు, స్థానికులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎమ్మెల్యే ఇటీవల రైల్వే దక్షణ మధ్య రైల్వే జీఎంను కలిసి రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. దీంతో రోడ్డు పనులను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లను ఆధునీకరిస్తామని అన్నారు. ఇందు కోసం ఆయా ప్రాంతాలను గుర్తిం చి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. అదే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ వెంకన్న, రామారావు, మల్లికార్జున్, శంకర్, ప్రేరణ, రవి, గోల్నాక టీఆర్ఎస్ అధ్యక్షుడు భరత్రాజ్ ముదిరాజ్, కన్నె రమేశ్యాదవ్, సునీల్బిడ్లాన్, బండ సూరి, డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల ఓం ప్రకాశ్యాదవ్, దిడ్డి రాంబాబు, బి.కృష్టాగౌడ్, ఎర్ర భీష్మ, నాగేందర్బాబ్జి, కాలేరు రామకృష్ణ, ఆర్కే బాబు, దేవేందర్, మహేందర్, సునీల్, వెంకటేశ్, సతీశ్, లక్ష్మీముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.