మియాపూర్ (హైదరాబాద్ ) : స్వరాష్ట్రంలోనే తెలంగాణ పండుగలకు కళ వచ్చిందని , పండుగలు అంగరంగ వైభవంగా నిర్వహణకు నోచుకుంటున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ( Whip Gandhi ) అన్నారు. బోనాల పండుగ నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 90 దేవాలయాలకు మంజూరైన రూ. 25.80 లక్షల నిధులను ఆలయ కమిటీలకు శుక్రవారం తన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ( Culture ), సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణలో అతి పెద్దగా జరిగే బోనాలు( Bonalu ), బతుకమ్మ పండుగ (Batukamma) లకు సీఎం కేసీఆర్ (CM KCR ) పాలనలోనే పునరుజ్జీవం వచ్చిందని పేర్కొన్నారు. వేడుకలకు వేదికలైన దేవాలయాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు.
నియోజకవర్గంలోనే ఎక్కువ దేవాలయాలకు నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR )కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, పార్టీ నేతలు , మహిళా నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.