మాదాపూర్, మార్చ్ 25: పైప్లైన్ నిర్మాణ పనుల్లో(Pipeline work) ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Gandhi )అన్నారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ప్రధాన గేట్ నుంచి కల్వరి టెంపుల్ వద్ద గల రిజర్వాయర్ వరకు రూ. 40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మంజీరా మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులను చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరడం సంతోషంగా ఉందన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరును అందించమే తమ ధ్యేయమన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.